తహసీల్దార్ కార్యాలయంలో.. రైతు ఆత్మహత్యాయత్నం

author img

By

Published : May 11, 2022, 5:36 AM IST

farmer

తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు బలవన్మరణానికి యత్నించాడు. భూమి ఆన్​లైన్ కోసం ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదని.. పురుగుల మందు తాగాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

ప్రకాశం జిల్లా పెద్దారవీడు తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. పురుగులమందు తాగిన ఆయన్ను....అక్కడున్నవారు వెంటనే మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తండ్రి మృతి అనంతరం తన సోదరుడు, తాను స్థలాలు పంచుకున్నట్లు రైతు చెన్నయ్య వెల్లడించారు. అయితే తన భాగం ఆన్‌లైన్ చేయించాలంటూ ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదని బాధితుడు తెలిపాడు.

తహసీల్దార్ కార్యాలయంలో.. రైతు ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి: కలెక్టరేట్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.