ETV Bharat / state

అండర్​ పాస్​లో నీళ్లు.. రైలు పట్టాలపైనే రాకపోకలు

author img

By

Published : May 22, 2021, 5:41 PM IST

ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంత ప్రజలు రైలు పట్టాలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. స్థానికుల అవసరాల దృష్ట్యా.. రాకపోకలు సాగించుకునేందురు రైలు పట్టాల కింద అండర్​ పాస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. రెండ్రోజల క్రితం కురిసిన వర్షాలకు.. అండర్ పాస్​ వద్ద మోకాళ్లలోతు నీరు చేరటంతో.. ప్రజలు రైలు పట్టాల పైనుంచి రాకపోకలు సాగిస్తున్నారు.

tracks
tracks


ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలోని రైలు పట్టాల కింద.. ప్రజలు రాకపోకలు సాగించుకునేందుకు అండర్ పాస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు అండర్ పాస్​లో నీరు చేరడంతో.. ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

దొనకొండ గ్రామం రైలు పట్టాలకు ఇరువైపులా ఉంటుంది. గతంలో రైలు ప్రయాణాలు సాగుతున్న సమయంలో.. గేటు వేసేవారు. ప్రజలు గేటు తీసిన తరువాత రాకపోకలు సాగించేవారు. ఇటీవల ప్రజల రాకపోకలకు రైల్వే అధికారులు పట్టాల కింద అండర్ పాస్ నిర్మించారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు అండర్ పాస్ నిండా మోకాళ్లలోతు నీళ్లు చేరటంతో.. ప్రజలు పట్టాలపై రాకపోకలు సాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు కురిసి రైళ్ల రాకపోకలు కొనసాగితే.. మా పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నించారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు గమనించి పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

పేకాట కోసం ఇంటిని అమ్మేసిన భర్త... కుమార్తెతో కలిసి భార్య ఆత్మహత్య!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.