ETV Bharat / state

COUPLE DIED IN ROAD ACCIDENT: రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

author img

By

Published : Dec 9, 2021, 12:17 AM IST

COUPLE DIED IN ROAD ACCIDENT: ఒకరికొకరు నిత్యం తోడున్న దంపతులు అనుకోని రోడ్డు ప్రమాదంలో ఒక్కసారిగా తనువు చాలించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

COUPLE DIED IN ROAD ACCIDENT
COUPLE DIED IN ROAD ACCIDENT

COUPLE DIED IN ROAD ACCIDENT: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం గ్రోత్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న.. వెంకటేశ్వర్లు అనంతలక్ష్మి దంపతులు మృతి చెందారు. మేదరమెట్లకు చెందిన దంపతులు పాత బట్టల దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.

వీరికి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. అతని చదువు కోసం అహర్నిశలు కష్టపడుతూ ఒకరికొకరు తోడుగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే పని ముగించుకుని వాహనంపై ఒంగోలు వెళుతుండగా గ్రోత్ సెంటర్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో డివైడర్ మధ్యలో ఉన్న బోర్డు ఢీకొని వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా అనంతలక్ష్మి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్​కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీరామ్ తెలిపారు.

ఇదీ చదవండి:

Employees Protest: ఉద్యోగుల పోరుబాట.. నల్ల బ్యాడ్జీలతో రెండోరోజూ నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.