ETV Bharat / state

YCP Leaders Attacked on TDP: నెల్లూరులో రెచ్చిపోయిన వైఎస్సార్​సీపీ నేతలు.. టీడీపీ సానుభూతిపరులపై కత్తులు, రాడ్లతో దాడి..

author img

By

Published : Jun 27, 2023, 7:34 AM IST

YSRCP Leaders Attacked on TDP Sympathizers: నెల్లూరు జిల్లా కావలి పట్టణం వెంగయ్యగారి పాళెంలో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి. గ్రామంలో బెల్టు షాపు నిర్వహిస్తున్నారని ప్రశ్నించిన టీడీపీ సానుభూతి పరులపై వైఎస్సార్​సీపీ నాయకులు కళ్లలో కారం చల్లి కత్తులు, రాడ్లతో దాడులకు తెగబడ్డారు. వివరాల్లోకి వెళ్తే..

Etv Bharat
Etv Bharat

నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

YSRCP Leaders Attacked on TDP Sympathizers: నెల్లూరు జిల్లా కావలి శివారు వెంగయ్యగారి పాలెంలో అధికార వైఎస్సార్​సీపీ నేతలు రెచ్చిపోయారు. బెల్టు షాపుపై ప్రశ్నించిన టీడీపీ సానుభూతిపరుల కళ్లలో కారం చల్లి కత్తులు, రాడ్లతో దాడి చేశారు. సోమవారం గ్రామంలో సీతారాముల తిరునాళ్ల జరగ్గా.. కోడంబిళ్ల ఆట విషయంలో ఇద్దరు యువకులు మధ్య వివాదం జరిగింది. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేస్తే.. పోలీసులు తీసుకోలేదు. పైగా గ్రామంలో బెల్ట్ దుకాణం పెట్టారని వైఎస్సార్​సీపీ నాయకుల్ని అడిగినందుకు.. కళ్లల్లో కారం కొట్టి.. కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తెలుగుదేశం సానుభూతిపరులైన ప్రసాదు, వెంకయ్య, ముసలయ్య, సుజాత, అరుణలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తర్వాత నెల్లూరు వైద్యశాలకు తరలించారు. టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు.. బాధితుల్ని పరామర్శించారు. గ్రామంలో, ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

"గ్రామంలో బెల్డ్ షాప్ పెట్టారని వైఎస్సార్​సీపీ నాయకుల్ని అడిగినందుకు.. బయటి ఊరివాళ్లను తీసుకుని వచ్చి.. కళ్లల్లో కారం కొట్టి.. వారిపై దాడులకు తెగబడ్డారు. దీంతో పాటు కత్తులను, రాడ్లను, సుత్తులను తీసుకుని వచ్చి వారిపై అమానుషంగా దాడి చేశారు." - మాలేపాటి సుబ్బానాయుడు, టీడీపీ నేత

"రావి చెట్టు వద్ద పిల్లలు సమయంలో వారు వచ్చారంట. దమ్ముంటే రండిరా.. మాతో కలిసి బిళ్లంగోడు ఆడండిరా అని రెచ్చగొట్టారంట. ఈ క్రమంలో వారు ముగ్గురు కలిసి.. ఈ ఇద్దరు పిల్లల్ని కొట్టారు. ఈ ఘటనపై మేము ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకోలేదు." - బాధితుల బంధువు

మద్యం దుకాణంలో రూ.7లక్షల నగదు చోరీ..
మరోవైపు నెల్లూరు నగరం బీ.వీ.నగర్ వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. షాప్​లోని రేకులు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు లాకర్​లో ఉన్న 7లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయారు. ఉదయాన్నే దుకాణం తెరిచిన సిబ్బంది.. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే వేదాయపాళెం స్టేషన్ పోలీసులతో పాటు ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. గత మూడు రోజుల మద్యం అమ్మకాలకు సంబంధించిన 7లక్షల రూపాయల నగదును లాకర్​ నుంచి అపహరించినట్లు పోలీసులు తెలిపారు. తెలిసిన వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.