ETV Bharat / state

విద్యుదఘాతంతో యువ రైతు దుర్మరణం

author img

By

Published : Nov 11, 2020, 11:57 AM IST

Young farmer dead with electric shock
విద్యుత్ షాక్​తో యువ రైతు దుర్మరణం

విద్యుదఘాతంతో నెల్లూరు జిల్లా కొత్తపల్లి గ్రామంలో ఓ యువరైతు మృతి చెందాడు. చెడిపోయిన బోరును బాగు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి మహేష్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం‌ కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దుద్దు గుంట మహేష్ (28) అనే యువరైతు.. పొలంలోని బోరు మోటారుకి మరమ్మతులు చేస్తున్నాడు. మోటారు పైకి లాగుతున్న క్రమంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్​ తీగలు తగిలి విద్యుదఘాతంతో మృతి చెందాడు.

ఇవీ చూడండి...

కార్తీక మహోత్సవాల ఏర్పాట్లపై మంత్రి అనిల్ కుమార్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.