నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అగ్రహరం గ్రామంలో అప్పుల బాధతో యువ రైతు కాసా యల్లా రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న రెండు ఎకరాల పోలంలో రెండేళ్ల క్రితం అప్పు చేసి మిరప పంట సాగు చేశాడు. వర్షాలు లేక పంట చేతికి రాలేదు. ఆ అప్పు తీర్చేందుకు మర్రిపాడు మండలంలో మరో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని మిరప పంట సాగు చేశాడు. ఇక్కడ అదే పరిస్థితి ఉండటంతో ఆరు లక్షల అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో దిక్కుతోచని స్థితిలో పురుగులు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతితో భార్య, ఇద్దరు కుమారులు వీధిన పడ్డారు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి...