CHILDREN DIED: పెన్నా నదిలో ఈతకు వెళ్లి.. గుంతలో పడి

author img

By

Published : Sep 17, 2021, 4:22 PM IST

two children died drowned in  penna river at nellore

నెల్లూరు మూడో మైలు ప్రాంతంలోని సుభాన్ నగర్​లో పెన్నా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు నిన్న సాయంత్రం పెన్నా నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ గుంతలో పడిపోయారు.

నెల్లూరులో విషాద ఘటన జరిగింది. పెన్నా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మూడో మైలు ప్రాంతంలోని సుభాన్ నగర్​లో ఈ ఘటన జరిగింది. దీనదయాళ్ నగర్​కు చెందిన ఇద్దరు చిన్నారులు నిన్న సాయంత్రం పెన్నా నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ గుంతలో పడిపోయారు. ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు.. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ రోజు చిన్నారుల మృతదేహాలు స్థానికులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

ఇదీ చదవండి:

KRMB: కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.