ETV Bharat / state

'అక్కడ ధరే ఇక్కడా ఇవ్వండి.. పొగాకు రైతులు డిమాండ్'

author img

By

Published : Mar 17, 2021, 1:56 PM IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులకు నిరాశే మిగులుతుంది. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని పొగాకు రైతులు దిగాలు చెందుతున్నారు. నెల్లూరు జిల్లాలో విస్తారంగా పొగాకు పంటను సాగు చేస్తారు. ఎన్నో కష్టాలు పడి పంటలు పండిస్తే కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tobacco farmers
గిట్టుబాటు ధర రాక రైతులు నిరాశ

నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు, ఉదయగిరి, వింజమూరు, కలిగిరి, దుత్తలూరు తదితర మండలాల్లో విస్తారంగా పొగాగు సాగు చేస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి పంటలు పండిస్తే కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో రెండు వందల రూపాయలు పైనే ధర పలుకుతుందని ఆశించిన రైతులకు.. నిరాశే మిగిలిందని రైతు నాయకులు వాపోతున్నారు. ఈ ధరలతో రైతులకు గిట్టుబాటు కాదని, ధరలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

బెంగళూరు పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు 265 రూపాయలు ధర పలికిందని.. ఆ విధంగానే డీసీ పల్లి, కలిగిరి పొగాకు వేలం కేంద్రాల్లో రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

రైతులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని డీసీ పల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి రాజశేఖర్ చెబుతున్నారు. బెంగళూరులో కిలోకి 265 రూపాయలు ధర పలికిన మాట వాస్తవమేనని.. అదే రేటు ఇక్కడ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ఇవీ చూడండి...

ప్రాథమిక పాఠశాలలో పెచ్చులూడిన పైకప్పు.. విద్యార్థికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.