ETV Bharat / state

పెన్నానదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతు

author img

By

Published : Jul 3, 2022, 9:17 PM IST

పెన్నానదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతు
పెన్నానదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతు

పెన్నానదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన నెల్లూరు జిల్లా సంగం వద్ద చోటుచేసుకుంది. గల్లైంతన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నానదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మెుత్తం ఆరుగురు యువకులు ఈతకు దిగగా.. ముగ్గురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారు సంగం మండలం పెరమన పంచాయతీ జంగాలదరువు గ్రామానికి చెందిన భవానీ, శ్యామ్ ప్రసాద్, చరణ్​గా గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.