ETV Bharat / state

'వైకాపాకు ప్రజలే బుద్ధి చెప్పే రోజు వస్తుంది'

author img

By

Published : Nov 13, 2020, 10:23 AM IST

తెదేపా ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వాహించారు. కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యలను నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Tdp candle rally
తెదేపా కొవ్వొత్తుల ర్యాలీ

కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యలను నిరసిస్తూ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ నేతృత్వంలో ర్యాలీ చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి సినిమా థియేటర్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చు మీరుతున్నాయంటూ వారు విమర్శించారు. వైకాపాకు ప్రజలే బుద్ధి చెప్పే రోజు వస్తుందని రామకృష్ణ హెచ్చరించారు.

ఇవీ చూడండి...

రొయ్యల చెరువుల వ్యర్థజలాలతో అన్నదాతకు కాలుష్య కష్టం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.