ETV Bharat / state

అటవీశాఖ భూమి అంటూ.. రొయ్యల గుంటలు పూడ్చివేత

author img

By

Published : Jul 16, 2019, 12:49 PM IST

నెల్లూరు జిల్లా కొత్తపల్లిలోని అటవీశాఖ భూమి అంటూ రొయ్యలగుంటలను ఆ శాఖాధికారులు పూడ్చివేశారు. కనీసం పది రోజుల గడువు కూడా ఇవ్వకుండా మొత్తం గుంటలన్నీ కూల్చేయడంతో 90 లక్షల రూపాయలు నష్టపోయానని బాధితుడు వాపోతున్నాడు.

రొయ్యలగుంటలు కూల్చివేత

రొయ్యలగుంటలు కూల్చివేత

నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కొత్తపల్లి గ్రామంలో రొయ్యల గుంటలను అటవీశాఖా అధికారులు పూడ్చివేశారు. కొత్తపల్లి గ్రామస్తులు గ్రామకంఠం కింద ఉన్న 16 ఎకరాల భూమిని నెల్లూరు నగరానికి చెందిన మునిరత్నంనాయుడు అనే రైతుకు లీజుకిచ్చారు. పొలం లీజుకిచ్చే రోజు అగ్రిమెంట్​లో గ్రామకంఠం అనే రాసిచ్చారు. కానీ.. ఇప్పుడు ఈ భూమి అటవీశాఖ కిందకు వస్తుందని చెప్పి మొత్తం రొయ్యల గంటలను కూల్చేస్తున్నారు. కనీసం పది రోజులు టైం కూడా ఇవ్వకుండా కూల్చివేయడంతో.. 90 లక్షల రూపాయల నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. దీనిపై తెలుగుదేశం పార్టీ, వైకాపా నాయకుల మధ్య వివాదం కొనసాగుతుందని మునిరత్నంనాయుడు ఆరోపిస్తున్నాడు.

ఇదీ చూడండి: తిరుమలలో బ్రేక్‌ దర్శనాలపై హైకోర్టులో వాదనలు..

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్....భారతదేశంలో వైద్యులు కొరత ఎక్కువగా ఉందని భారత ప్రభుత్వం వైద్యులు కొరత తీర్చేందుకు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన ఇంకా వైద్యులు కొరత ఉందని నియో గ్రూప్ ఎండీ డాక్టర్ దివ్యరాజ్ పేర్కొన్నారు. నీట్ పరీక్షకు 15 లక్షల మంది పోటీపడుతుంటే 65 వేల సీట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో విదేశాలలో లో వైద్య విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారన్నారు. విదేశాలలో వైద్య విద్యను అభ్యసించాలంటే సరైన సంస్థలను ఎంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య విద్యను పూర్తి చేయాలన్నారు . విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లి విద్యార్థులు ప్రతీ ఏటా రెండు వేలకు పైగా నష్టపోతున్నారని, మోసాలు గురవుతున్నారని ఇండియన్ ఎంబసీ లో ఫిర్యాదు చేస్తున్నట్లు వివరించారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు విదేశీ వైద్య విద్యపై సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. నియో గ్రూప్ ద్వారా 20 ఏళ్లలో 3వేల మంది వైద్యులును అందించామని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు విదేశాల్లోని వైద్య కళాశాలకు తీసుకెళ్లి వారికి ఇష్టమైన క్యాంపస్లో చేర్పిస్తున్నట్లు వివరించారు. కావున విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఈ నెల 14న విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ఎంబీబీఎస్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు సంస్థ డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ సదస్సులో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.



Body:బైట్...డాక్టర్..దివ్యరాజ్....నియో గ్రూప్ ఎండీ.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.