ETV Bharat / state

Rural Roads are Damaged by Sand Transport: విచ్చలవిడిగా వైసీపీ నేతల ఇసుక రవాణా..సామాన్యుల నోట్లో మట్టి!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2023, 8:32 AM IST

Updated : Sep 6, 2023, 12:12 PM IST

Rural Roads are Damaged by Sand Transport :ఇసుక రవాణా ధాటికి ఆ రహదారి రూపురేఖలే కోల్పోయింది. మొత్తం దుమ్ము, ధూళితో నిండిపోయింది. ముందు వాహనం వెళ్తే కనుచూపుమేరలో గాలి కాలుష్యమే! పరిమితికి మించి భారీ టిప్పర్లతో ఇసుక తరలించుకుపోతున్న ఇసుకాసురులు.. రోడ్డు పక్కనుండే ప్రజల నోట్లో మట్టికొడుతున్నారు.

Rural_Roads_are_Damaged_by_Sand_Transport
Rural_Roads_are_Damaged_by_Sand_Transport

Rural Roads are Damaged by Sand Transport: విచ్చలవిడిగా వైసీపీ నేతల ఇసుక రవాణా..సామాన్యుల నోట్లో మట్టి!

Rural Roads are Damaged by Sand Transport : ఇసుకాసురుల అరాచకాలు నెల్లూరు జిల్లాలో శ్రుతిమించాయి. పెన్నానదిని ధ్వంసం చేయడమే కాకుండా.. గ్రామీణ రోడ్లను ధ్వంసం చేస్తున్నారు. అధిక లోడుతో వాహనాలను తిప్పుతూ భారీ గోతులుగా మార్చారు. రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. దుమ్మూ.. ధూళితో గామాల్లో వాతావరణం కలుషితం చేస్తున్నారు. వాతావరణ కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నారు. పచ్చటి పంట పొలాలు, ఇసుక వాహనాల దుమ్ముతో నిండిపోతున్నాయి. గ్రామాల ప్రజలు, రైతులు ధర్నాలు చేస్తున్నా నెల్లూరు జిల్లాలో ఇసుక రవాణా అక్రమ రవాణా ఆగడం లేదు. పల్లెపాడు ఇసుక రీచ్​కి వెళ్లే రోడ్డు దుస్థితే ఇందుకు నిదర్శనం.

People Facing Problems Due to Sand Transportation : నెల్లూరు జిల్లాలో ఆరు ఓపెన్ రీచ్​లు, సంగం వద్ద రెండు డీసిల్టేషన్ రీచ్​లు ఉన్నాయి. ఓపెన్ రీచ్​లకు అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారు. పెన్నా నది పొర్లు కట్టలను దెబ్బతీస్తున్నారు. అధిక లోడ్​తో గ్రామీణ రోడ్లను ధ్వంసం చేస్తున్నారు. ఇది పల్లెపాడు రోడ్డు దుస్ధితి ఇది..

Eenadu-ETV Bharat Team Examined Sand Reaches in AP: ఇది ఇసుక దోపిడీ కాదా..? ఇసుక రీచ్​లలో ఈటీవీ భారత్​ - ఈనాడు పరిశీలన..

జిల్లాలో ఇసుక రవాణా ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో జరుగుతుంది. రీచ్​లలో ఇసుక తూకం వేసి తనిఖీలు చేసే నిబంధనలు పాటించడం లేదు. 14 టైర్ల లారీల్లో 30 టన్నులు సామర్ధ్యంతో మాత్రమే తీసుకుపోవాలి. నిబంధనలు పాటించకుండా క్యాబిన్ స్దాయి వరకు పోసి 45 టన్నులు ఇసుకను లోడ్ చేసి తీసుకుపోతున్నారు.

Roads Damaged In Nellore : వేబ్రిడ్జి లేకపోవడంతో ప్రొక్లైయిన్ బకెట్​లతో కొలతలు వేస్తున్నారు. 15 బకెట్లు పోస్తే 30 టన్నుల ఇసుక కొలత వస్తుంది. డబ్బులు కోసం అదనంగా ఐదు బకెట్లకు పైగా పోసి లారీల్లో నింపి పంపిస్తున్నారు. ఇంత బరువును తట్టుకునే సామర్ధ్యం గ్రామీణ రోడ్లకు లేవు. నాలుగు సంవత్సరాలుగా రోడ్లు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

YCP Leaders Illegal Sand Mining: ఇసుకలో 'దోచుకో, పంచుకో, తినుకో'.. తవ్వకాలపై పెదవి విప్పని ప్రభుత్వం

గత నాలుగు సంవత్సరాలుగా రోడ్లు మరమ్మతుకు నిధులు మంజూరు కాలేదు. ఇసుక వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వానికి లాభసాటిగా ఉన్నప్పటికీ కనీసం ఇసుక లారీలు తిరిగే గ్రామీణ రోడ్లను కూడా బాగు చేయలేదని ప్రజలు వాపోతున్నారు. రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఈ రోడ్లపై వెళ్ళలేక నానా అవస్థలు పడుతున్నామని వాహనదారులు వాపోయారు.

నెల్లూరు నుంచి పల్లెపాడు రీచ్​కు వెళ్లే రోడ్డు గుంతలు దుమ్ముతో నిండిపోయింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా భారీ ఇసుక వాహనాలు తిరగడంతో రోడ్డు పక్కనే ఉన్న వందలాది ఇళ్ళలోకి మట్టి వచ్చిపడుతుంది. గోడలు మట్టితో నిండిపోయాయి. ఇంట్లో ఉన్న నీరు దుమ్ముతో కలుషితంగా మారింది. తినే తిండిలోనూ దుమ్ము వస్తుందని వాపోతున్నారు. తమ బాధలు ఎవరు పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక వ్యాపారంలో వైసీపీ నాయకులు ఉండటంతో మైనింగ్, రోడ్డు రవాణా శాఖ, రోడ్లు భవనాల శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని, అధిక లోడుతో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. రోడ్డు ఇంతగా ఛిద్రమైనా కనీస మరమ్మతు చేయించ లేదు. నిధులు మంజూరు చేయలేదు.

Illegal Sand Mining in Krishna River: కృష్ణాతీరంలో ఇసుక తవ్వకాలు.. కొండలను తలపిస్తున్న ఇసుక డంపులు

Last Updated : Sep 6, 2023, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.