నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో తిరుపతి లోక్సభ తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చెన్నూరు నుంచి ర్యాలీగా వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. తిరుపతి ఎంపీగా గెలిపించి ఆశీర్వదించమని కోరారు. తెదేపా ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు..
ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో గెలిచేందుకు వైకాపా నేతలు వాలంటీర్లపై ఒత్తిడి తెస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యేలు రామానాయుడు, నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు. సాఫీగా ఎన్నికలు జరిగితే వైకాపా నూటికి నూరుశాతం ఓడిపోవటం ఖాయమన్నారు.
ఇదీచదవండి