ETV Bharat / state

ఎమ్మెల్యేకు కోపం వచ్చింది.. పురపాలక సమావేశం అర్ధంతరంగా ముగిసింది..

author img

By

Published : Oct 30, 2021, 8:18 PM IST

వెంకటగిరి పురపాలక సాధారణ సమావేశంలో అందరూ అధికార పార్టీ సభ్యులే. అయినా.. వారిలో పలువురు వివిధ సమస్యలపై గొంతెత్తారు. ప్రతి పనికీ చేసే ఖర్చులని బహిరంగం చేయాలని శానిటరీ ఇన్ స్పెక్టర్​ను 14వ వార్డ్ కౌన్సిలర్​ శంకరయ్య అడగడంతో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు.

వెంకటగిరి పురపాలక సమావేశం
వెంకటగిరి పురపాలక సమావేశం

నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలిక సాధారణ సమావేశం మొదలైన క్షణాల్లోనే ముగిసింది. అధికార పార్టీ కౌన్సిలర్లే పురపాలిక అభివృద్ధి గురించి నిలదీయడంతో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. ఈ రకంగా పాలక సభ్యులు మాట్లాడితే మంచిది కాదని, సమావేశాన్ని ముగించాలని అన్నారు. దాంతో వెంకటగిరి పురపాలిక ఛైర్​పర్సన్​​​ భానుప్రియ సమావేశాన్ని ముగించారు.

వెంకటగిరి పురపాలక సాధారణ సమావేశంలో అందరూ అధికార పార్టీ సభ్యులే అయినా వారిలో పలువురు వివిధ అంశాలపై నిలదీశారు. మూడు నెలలుగా పుర పాలక సిబ్బందికి జీతాలు ఇవ్వట్లేదని వెంకటగిరి పురపాలక మాజీ ఛైర్​పర్సన్​, ప్రస్తుత కౌన్సెలర్​ శారద అన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య చర్యలు సరిగా లేవని కౌన్సిలర్​ ఢిల్లీబాబు నిలదీశారు. ఆర్టీసీ బస్సులు పాత బస్టాండ్​ మీదుగా వచ్చేలా చూడాలని కోరారు.

ప్రతి పనికీ చేసే ఖర్చులని బహిరంగం చేయాలని శానిటరీ ఇన్ స్పెక్టర్​ను 14వ వార్డ్ కౌన్సిలర్​ శంకరయ్య అడగడంతో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. మున్సిపాలిటీ బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేకపోయినా ఈ రకంగా సభ్యులు నిలదీయడం ఏమిటని ఎమ్మెల్యే మండిపడ్డారు. సభకు ముగింపు చెప్పాలని ఆయన పేర్కొనడంతో ఛైర్ పర్సన్​ భానుప్రియ ముగించారు. ఈ దశలో తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని మరో సభ్యురాలు వాహిదా విఫలయత్నం చేశారు. ఈ రకంగా పాలక సభ్యులు మాట్లాడితే మంచిది కాదంటూ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.

ఇదీ చదవండి: KOTAMREDDY SRINIVASULU REDDY: రోడ్డుపై పడుకొని తెదేపా నేత నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.