ETV Bharat / state

'బహిరంగ మార్కెట్లకు రైతులు స్వస్తి పలకాలి'

author img

By

Published : Jun 12, 2020, 5:10 PM IST

రైతులు ఎరువులు, యంత్రపరికరాలు బహిరంగ మార్కెట్​లో కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నారని నెల్లూరు జిల్లా కలెక్టర్​ శేషగిరి బాబు తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన బహిరంగ మార్కెట్లకు రైతులు స్వస్తి పలికేలా రైతు భరోసా కేంద్రాల్లో చర్యలు చేపట్టాలని సూచించారు.

వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఖరీఫ్ సీజన్లో పంటల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉన్న 660 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, పురుగులమందులు, యంత్ర పరికరాలు అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి రైతు... రైతుభరోసా కేంద్రాల్లోనే ఎరువులు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఇదీ చూడండి: పులివెందుల మోడల్‌ టౌన్‌పై సీఎం సమీక్ష

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.