ETV Bharat / state

మొదలైన పాఠశాలలు..నందవరంలో నలుగురికి కరోనా

author img

By

Published : Nov 2, 2020, 3:17 PM IST

Updated : Nov 2, 2020, 3:34 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరంలోని పాఠశాలలో నలుగురికి కరోనా పాజిటివ్​గా తెలింది. పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా 50 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.

నందవరంలోని
నందవరంలోని

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆదర్శ పాఠశాల, జడ్పీ హైస్కూల్ విద్యార్థులు,​ సిబ్బందితో కలిపి మొత్తం 50 మందికి టెస్టులు చేయగా.. నలుగురికి పాజిటివ్​గా తెలింది. ఇందులో ఒక విద్యార్థి, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఫలితంగా విద్యార్థులను ఇళ్లకు పంపించారు.

ఇదీ చూడండి:

తెరుచుకున్న పాఠశాలలు... కొవిడ్ నిబంధనలు తప్పనిసరి


నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల నందవరం గ్రామంలో మోడల్ స్కూల్, జడ్పీ హైస్కూల్ లో స్కూల్ తెరిచిన మొదటి రోజే నలుగురికి కరోనా సోకింది. 50 మందికి విద్యార్థులు మరియు సిబ్బందికి మెడికల్ సిబ్బంది పరీక్షలు చేయగా..కేసులు నిర్ధరణ అయ్యాయి. మోడల్ స్కూల్​లో ఒక విద్యార్దికి, వంట సిబ్బందికి కరోనా పాజిటివ్​ వచ్చింది. జడ్పీ హైస్కూల్​లో వంట సిబ్బందికి ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా విద్యార్ధులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్దులను ఇంటికి పంపించారు.

Last Updated : Nov 2, 2020, 3:34 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.