'మేం అధికారంలోకి వస్తే.. వారి నిధులు వాళ్లకే'

author img

By

Published : Jun 23, 2022, 3:37 PM IST

Somu veerraju

Somu Veerraju Comments: వైకాపా ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. సర్పంచ్​ల నిధులను ప్రభుత్వం కాజేస్తుందని.. వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అలాగే తాము అధికారంలోకి వస్తే సర్పంచ్​లకు ప్రత్యేక శాఖ కేటాయించి.. వారి నిధులు వారే వాడుకునే విధంగా చేస్తామన్నారు.

BJP fire on YSRCP: రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. సర్పంచ్​ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తుందని విమర్శించారు. కేంద్రం నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంటే.. 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రప్రభుత్వం ఇంకా జమ చేయలేదని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే.. సర్పంచ్​లకు ప్రత్యేక శాఖ కేటాయించి.. వారి నిధులు వారే వాడుకునే విధంగా చేస్తామన్నారు.

సర్పంచ్​ల నిధులను సీఎం జగన్ వాడుకునే హక్కు లేదని సోము వీర్రాజు అన్నారు. వెంటనే వారి నిధులు విడుదల చేయకపోతే.. సర్పంచ్​లతో కలిసి పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం లేదన్నారు. రైతు భరోసా కేంద్రాల పేరుతో రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు తగిన గుణపాఠం చెప్తారని సోము వీర్రాజు అన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.