ETV Bharat / state

Amaravati Padayatra: సడలని సంకల్పం.. సమరోత్సాహంతో రైతు పాదయాత్ర

author img

By

Published : Dec 5, 2021, 7:53 PM IST

అమరావతి రైతుల మహాపాదయాత్ర
అమరావతి రైతుల మహాపాదయాత్ర

amaravathi farmers: రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అన్నదాతలు చేపట్టిన పాదయాత్ర సమరోత్సాహంతో సాగుతోంది. మహా పాదయాత్రలో పాల్గొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నది తమ కోసం కాదని.. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసమని అన్నారు.

amaravathi farmers: నెల్లూరు జిల్లాలో రైతు మహా పాదయాత్ర సమరోత్సాహంతో సాగుతోంది. పాదయాత్రలో జై అమరావతి నినాదాలు హోరెత్తుతున్నాయి. 35వ రోజు గూడూరు నియోజకవర్గం పుట్టంరాజు కండ్రిగ నుంచి యాత్ర ప్రారంభించిన అన్నదాతలు.. గొల్లపల్లి, వెంకటరెడ్డి పల్లి, అంబలపూడి, బాలాయపల్లి, యాచవరం మీదుగా వెంగమాంబపురం చేరుకోవడంతో ఈ రోజు యాత్ర ముగిసింది. పాదయాత్ర పొడవునా రైతులకు పల్లె ప్రజలు అడుగడుగునా పట్టంకట్టారు.

మండుటెండ ఇబ్బంది పెడుతున్నా.. మహిళలు, అన్నదాతలు చెక్కు చెదరని సంకల్పంతో ముందుకు సాగారు. రాజధాని రైతులు చేసే పాదయాత్ర తమ స్వార్ధం కోసం కాదని.. రాష్ట్రం బాగు కోసమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. పుట్టంరాజు కండ్రిగ గ్రామంలో రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. ఒక రాజధాని ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు.

చెన్నై తెలుగుసంఘం నుంచి వచ్చిన 150 మంది ప్రతినిధులు అన్నదాతలకు సంఘీభావం తెలిపారు. రైతులు, ప్రజలు పడుతున్న కష్టాన్ని చూసి వారికి మద్దతు తెలిపేందుకు వచ్చామని వెల్లడించారు. 35వ రోజు యాత్రకు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. శనివారం బౌన్సర్లపై జరిగిన దాడి, తదితర పరిణామాలతో వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావును బందోబస్తు విధులకు దూరం పెట్టారు.

ఇదీ చదవండి:


ఒకే పాఠశాలలో 60కిపైగా విద్యార్థులకు కరోనా.. లక్షణాలు లేకుండానే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.