నరసరావుపేటలో విషాదం.. అదృశ్యమైన బాలుడు మృతి

author img

By

Published : Jan 22, 2023, 10:13 AM IST

Updated : Jan 22, 2023, 10:36 AM IST

BOY

Missing child boy died in well : పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఏడాది వయస్సున్న చిన్నారి నిన్న అదృశ్యమైన విషయం తెలిసిందే.. అయితే ఇంటి బయట ఆడుకుంటున్న తన కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు తండ్రి బండి వాసు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇప్పుడు ఆ బాలుడు మృతి చెందాడు.

Missing child boy died in well: పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిన్న కనిపించకుండా పోయిన ఏడాది బాలుడు మృతి చెెందాడు. కాగా ఇంటి పక్కనే బావిలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం నుంచి తమ కుమారుడు కనిపించకపోవడంతో నరసరావుపేట గ్రామీణ పోలీసులకు తండ్రి వాసు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బావిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.

అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించామని.. బాలుడి మృతిపై మరింత లోతుగా విచారణ చేస్తున్నామని సీఐ భక్తవత్సలరెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 22, 2023, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.