ETV Bharat / state

మాచర్ల టీడీపీ ఇన్​చార్జి బ్రహ్మారెడ్డి భద్రతపై ఎస్పీకి లేఖ

author img

By

Published : Jan 7, 2023, 6:14 PM IST

GV Anjaneyulu Wrote Letter To The Palnadu SP: పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీ ఇన్​చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు టీడీపీ నేతలకు భద్రత కల్పించాలని పల్నాడు ఎస్పీకి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు లేఖ రాశారు. బ్రహ్మారెడ్డి ప్రాణానికి భద్రత కల్పించాలని లేఖలో తెలిపారు.

Etv Bharat
Etv Bharat

GV Anjaneyulu Wrote Letter To The Palnadu SP: పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీ ఇన్​చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు టీడీపీ నేతలకు భద్రత కల్పించాలని పల్నాడు ఎస్పీకి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు లేఖ రాశారు. మాచర్ల అల్లర్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన బ్రహ్మారెడ్డికి హైకోర్టు కండీషన్ బెయిల్ జారీ చేసింది. బ్రహ్మారెడ్డితో పాటు మరో 22 మందికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం మాచర్ల పోలీస్ స్టేషన్​లో సంతకాలు పెట్టేందుకు 23 మంది టీడీపీ నేతలు రానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు మాచర్ల వెళ్లేందుకు జీవీ ఆంజనేయులు అనుమతి కోరారు. ప్రస్తుతం మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది. బ్రహ్మారెడ్డి ప్రాణానికి భద్రత కల్పించాలని లేఖలో తెలిపారు.

ఎస్పీకి జీవీ ఆంజనేయులు రాసిన లేఖ
ఎస్పీకి జీవీ ఆంజనేయులు రాసిన లేఖ

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.