ETV Bharat / state

మాచర్లలో వరుస దొంగతనాలు.. బెంబేలెత్తుతున్న ప్రజలు

author img

By

Published : Jan 31, 2023, 5:01 PM IST

Thefts in Macharla : పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో దొంగలు హాల్ చల్ చేసిన సంఘటన పట్టణ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వారం రోజుల క్రితం సొసైటీ కాలనీలో ని ఓ అపార్టుమెంట్లో అర్ధరాత్రి కొందరు దొంగతనానికి పాల్పడి విఫలమయ్యారు.

Theft
దొంగతనాలు

Thefts in Macharla : నలుగురు గ్యాంగ్ అపార్ట్​మెంట్​లోని తాళం వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా చేసుకుని.. వాటిని పగల గొట్టేందుకు ప్రయత్నించారు. ముఖాలకు మంకీ క్యాప్ లు, చేతిలో ఇనుప రాడ్లు పట్టుకుని అపార్ట్​మెంట్​లోకి చొరబడ్డారు. తాళాలు రాకపోవడంతో వెనుదిరిగారు. ఈ ఘటన పల్నాడు జిల్లా మాచర్లలో జగిగింది. కాగా ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం వల్ల అపార్టెమెంట్​ వాసులు పోలీసులను ఆశ్రయించారు.

ఇదిలా ఉండగా పట్టణంలోని ఓల్డ్ టౌన్​లో సచివాలయ మహిళా కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగి సుమారు మూడు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. సదరు మహిళా కానిస్టేబుల్ కుటుంబంతో కలిసి తిరుపతికి వెళ్లడంతో ఈ చోరీ జరిగింది. పట్టణంలో రాత్రివేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. దొంగలు చోరీకి యత్నించిన అపార్టుమెంట్ పక్కనే ఉన్న మరో అపార్ట్​మెంట్​లో ఒక సీఐ, ఎస్సై నివాసం ఉండటం గమనార్హం.

అపార్ట్​మెంట్​లో చోరీకి యత్నం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.