ETV Bharat / state

కాగ్​కు లెక్కలు ఎందుకు చెప్పటం లేదు: యనమల రామకృష్ణుడు

author img

By

Published : Oct 23, 2022, 3:39 PM IST

Etv Bharat
Etv Bharat

Yanamala Rama Krishnudu : ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి అప్పులపై అనుసరిస్తున్న విధానంపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. తెచ్చిన అప్పులు స్వార్థానికి వినియోగిస్తున్నారు తప్ప.. అభివృద్ధికి వినియోగించటం లేదని విమర్శించారు. కాగ్​కు లెక్కలు తెలపకపోవటానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు.

Yanamala Rama Krishnudu : జగన్మోహన్ రెడ్డి రానున్న తరాలకు భవిష్యత్తు కూడా లేకుండా చేస్తున్నారని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆక్షేపించారు. తెచ్చిన అప్పు స్వార్ధానికే జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోందని మండిపడ్డారు. అర్హతకు మించి చేసిన అప్పులకు లెక్కలు లేకపోవడమే.. నిధుల దుర్వినియోగానికి సాక్ష్యమన్నారు. అవినీతి బయటకు రాకూడదని లెక్కలు చూపట్లేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మోసాలను ఇంకా నమ్మితే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగ్​కు ఎందుకు లెక్కలు చెప్పట్లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెదేపా నేత యనమల రామకృష్ణుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.