ETV Bharat / state

మార్చి నుంచి కొత్త పథకం.. వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం

author img

By

Published : Jan 27, 2023, 7:39 PM IST

సీఎం జగన్‌ సమీక్ష
సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan Review : వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మార్చి1 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ పథకం అమలుకు సీఎం జగన్‌ ఆదేశాలిచ్చారు. మార్చి 1న గోరుముద్దలో భాగంగా రాగి మాల్ట్‌ పంపిణీ చేసేందుకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ఆరోగ్యశ్రీ యాప్‌లో మరికొన్ని మార్పులు చేర్పులపై సూచనలు చేసి.. త్వరలోనే ఆరోగ్యశ్రీ యాప్‌ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

CM Jagan Review : మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్​ కాన్సెప్ట్‌ అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రుల సందర్శన ప్రారంభించాలని.. గోరుముద్దలో భాగంగా వారానికి మూడు సార్లు పిల్లలకు రాగిమాల్ట్‌ పంపిణీ ప్రారంభించాలని సూచించారు. అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్‌ నివారణ పరికరాలు, చికిత్సలతో పాటు క్యాథ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం సమీక్షించారు. పలాసలో నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌.. 200 పడకల ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలతో పాటు, సిబ్బందిని నియమించాలని అదేశాలు జారీ చేశారు.

ఎమ్మెల్యేల, ప్రజా ప్రతినిధులు ఆసుపత్రుల సందర్శన వల్ల ఆసుపత్రులపై పర్యవేక్షణ ఉంటుందని సీఎం వివరించారు. సమస్యలు, లోపాలు ఉంటే ఫీడ్​బ్యాక్​ తీసుకోవటం వల్ల పరిష్కర మార్గం దొరుకుతుందని అన్నారు. ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని భావించారు. ఆసుపత్రులలో మందులు, సర్జికల్స్‌ అన్నీ అందుబాటులో ఉండాలని అదేశించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై సీఎం చర్చించారు. మార్చి 1న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పూర్తి స్థాయిలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్స్‌ అన్నీ అందుబాటులో ఉండాలన్నారు. మందులకు కొరత ఉందన్న మాట ఎక్కడ వినిపించకూడదని హెచ్చరించారు.

వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్న సీఎం.. గ్రామ సచివాలయ స్థాయిలోనే ఎనీమియా లాంటి కేసులను గుర్తించి వారి ఆరోగ్యానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాలతో అనుసంధానమై రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బంది నుంచి సమస్యలున్నాయని తెలిసిన వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు. మండలస్థాయి అధికారులు, జేసీ, కలెక్టర్లు వీటిపై పర్యవేక్షణ చేయాలన్నారు.

గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ, మధుమేహం నివారణ, చికిత్సలపై సీఎం సమీక్షించారు. ఈ వ్యాధులతో బాధపడే వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్న సీఎం.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిని నివారించడానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చుపెడుతున్నామని సమీక్షలో వెల్లడించారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి పథకం, ఆసుపత్రి రెండు మార్చికల్లా పూర్తవుతుందని పేర్కొన్నారు. పలాసలో నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ మరియు 200 పడకల ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.

ప్రతి బోధనాసుపత్రిలో కూడా క్యాన్సర్‌ నివారణ పరికరాలు, చికిత్స అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీల్లోనూ ఈ పరికరాలు, చికిత్సలు ఉండాలని సూచించారు. ప్రతి బోధనాసుపత్రిలోనూ గుండెజబ్బుల చికిత్స కేంద్రాలు ఉండాలన్న సీఎం.. అన్ని చోట్లా క్యాథ్‌ ల్యాబ్స్‌ పెట్టాలన్నారు. నూతన మెడికల్‌ కాలేజీల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలన్నారు. చిన్న పిల్లల్లో, పాఠశాల చిన్నారుల్లో​ దంత శుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలపై యాప్‌ను రూపొందించినట్లు అధికారులు తెలియజేయగా.. యాప్‌లో మరికొన్ని మార్పులు చేర్పులు చేయాలని సీఎం సూచించారు. త్వరలోనే యాప్‌ ప్రారంభానికి సన్నాహాలు చేయాలన్నారు. రోగులకు మరింత నాణ్యతతో, మెరుగైన సేవలే లక్ష్యంగా యాప్‌ ఉండాలని సీఎం నిర్దేశించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.