ETV Bharat / state

CM Jagan Cheated Anganwadi Workers: అంగన్వాడీలను నిలువునా ముంచిన జగన్‌ సర్కార్‌..ఇచ్చిన హామీలను మర్చిపోయిన ప్రభుత్వం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2023, 7:36 AM IST

Updated : Aug 31, 2023, 12:50 PM IST

CM Jagan Cheated Anganwadi Workers: మాట తప్పడంలో.. మడమ తిప్పడంలో ఇప్పటికే ఎవరికీ సాధ్యంకాని రికార్డులను నెలకొల్పిన సీఎం జగన్.. అంగన్వాడీలనూ నిలువునా ముంచేశారు. మహిళా సాధికారతకు పట్టం కడుతున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే ఆయన.. వాస్తవంలో వారికి మొండిచేయి చూపించారు. తెలంగాణ కంటే అధికంగా వేతనాలు పెంచుతానని.. ప్రతిపక్షనేతగా ఊదరగొట్టిన జగన్‌.. గద్దెనెక్కాక గతాన్ని మర్చిపోయారు. హామీలు నెరవేర్చండంటూ కదం తొక్కిన అంగన్‌వాడీలపై ఉక్కుపాదం మోపుతున్నారు.

CM_Jagan_Cheated_Anganwadi_Workers
CM_Jagan_Cheated_Anganwadi_Workers

CM Jagan Cheated Anganwadi Workers: అంగన్వాడీలను నిలువునా ముంచిన జగన్‌ సర్కార్‌..ఇచ్చిన హామీలను మర్చిపోయిన ప్రభుత్వం

CM Jagan Cheated Anganwadi Workers : నాడు ప్రతిపక్షనేతగా జగన్‌ మోహన్ రెడ్డి అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీ! మరి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ హామీని నెరవేర్చకుండా తుంగలో తొక్కారు. తెలంగాణలో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా ఉన్నతీకరించనున్నట్లు ప్రకటించారు. తద్వారా వాటిల్లోని అంగన్వాడీ కార్యకర్తలకు వేతనం 5వేల 850 రూపాయల చొప్పున పెరగనుంది.

Anganwadi Workers Protest Against YSRCP Government : మన రాష్ట్రంలో మాత్రం అంగన్వాడీ సిబ్బంది డిమాండ్ల సాధన కోసం రెండేళ్లుగా రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు చేస్తున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదు. ఓ పక్క అంగన్వాడీలపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తుంటే మన రాష్ట్రంలో జగన్ సర్కారు దారుణంగా వంచించింది. డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు పోరుబాట పడితే కనీసం వారిని పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు. పైగా మహిళల ధర్నాలు, నిరసనలను ఉక్కుపాదంతో (Iron foot on Anganwadis) అణచి వేస్తున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల ధర్నా.. జగన్ హామీ ఏమైందని ప్రశ్న


తెలంగాణలో పదవీ విరమణ ప్రయోజనాలు : జగన్‌ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అంగన్వాడీల వేతనం వెయ్యి పెంచారు. కొంత కాలానికి సంక్షేమ పథకాల్లో కోత (Welfare Schemes Cut for Anganwadis) పెట్టారు. ఈ నాలుగేళ్లలో తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తలకు మరో 3వేల 150 రూపాయల చొప్పున పెంచినా జగన్ మనసు కరగలేదు. తాజాగా అక్కడి ప్రభుత్వం వారి ఉద్యోగ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచింది. ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు లక్ష రూపాయలు, ఆయాలకు 50 వేల రూపాయల చొప్పున చెల్లించాలని నిర్ణయించింది.

మన రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు 50 వేలు, ఆయాలకు 20 వేల రూపాయలు ఇస్తున్నారు. ఇదీ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందే. వైసీపీ ప్రభుత్వం దీన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని అంగన్వాడీ ప్రతినిధులు మండి పడుతున్నారు.

Anganwadi Workers Protest: కదం తొక్కిన అంగన్వాడీలు.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు


తెలంగాణలోని అంగన్వాడీ సిబ్బందికి గత తొమ్మిదేళ్లలో పెరిగిన వేతనం 225 శాతం. 2015లో 4వేల 500గా ఉండగా 13వేల 650కి పెరిగింది. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక కష్టాలున్నా.. తెలంగాణ ప్రభుత్వానికి ఏ మాత్రం తీసిపోకుండా అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాలను పెంచింది.

తన ఐదేళ్ల పాలనలో అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని 4,200 నుంచి 10వేల 500 రూపాయలకు పెంచింది. అప్పటి నిబంధనల ప్రకారం వారి వేతనం ఆదాయ పరిమితిని దాటి సంక్షేమ పథకాల లబ్ధికి దూరమయ్యే అవకాశం ఉన్నా కోత పెట్టలేదు.

జగన్‌ పెంచింది 9.5 శాతమే : వైసీపీ అధికారంలోకి రాగానే 2019 జూన్‌లో అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని10వేల 500 నుంచి 11వేల 500 రూపాయలకు పెంచింది. అంటే 9.5 శాతమే. నవరత్నాల నిబంధనల ప్రకారం నెలసరి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయలు మించకూడదు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 46 వేల మందిని సంక్షేమ పథకాలకు ప్రభుత్వం దూరం చేసింది.


Anganwadi Workers Protest: డిమాండ్లు నేరవేర్చకపోతే తాడేపల్లి ప్యాలెస్‌ ముట్టడి.. అంగన్‌వాడీ కార్యకర్తల హెచ్చరిక

Last Updated :Aug 31, 2023, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.