ETV Bharat / state

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Nov 20, 2022, 5:01 PM IST

AP TOP NEWS
AP TOP NEWS

.

  • పవన్​ను ఏదో ఒకరోజు.. ఉన్నతస్థాయిలో చూస్తాం: చిరంజీవి
    మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉండాలంటే చాలా మొరటుగా, కటువుగా ఉండాలన్న చిరంజీవి.. ఆ లక్షణాలు లేకపోవడం వల్లే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టాలనుకోవడం తన మనసు నుంచి వచ్చింది కాదన్న చిరంజీవి.. ఆ రంగంలో మాటలు అనాలన్నా.. అనిపించుకోవాలన్నా తన సోదరుడు పవన కల్యాణ్ సమర్థుడని పేర్కొన్నాడు. పవన్​ను ఏదో ఒకరోజు ఉన్నత స్థాయిలో చూసే అవకాశం వస్తుందని చిరంజీవి అభిలాషించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైయస్సార్​సీపీ నేతలలో ఆందోళన తీవ్రస్థాయికి చేరింది: యనమల రామకృష్ణుడు
    విభజన హామీల అమలులో జగన్‌ విఫలమయ్యారని టీడీపీ శాసన మండలిప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. టీడీపీ సభలకు వస్తున్న జనసునామీని చూసి వైయస్సార్​సీపీ నేతలలో ఆందోళన తీవ్రస్థాయికి చేరిందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రానికి “ఇదేం ఖర్మ” అనేలా చేస్తున్నారు: పట్టాభి
    ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు 'ఇదేం ఖర్మ' అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే.. ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని లెక్కలతో సహా ప్రజల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మీడియాతో మాట్లాడుతూ “ఇదేం ఖర్మ రాష్ట్రానికి” అనేవిధంగా.. ఆర్బీఐ నుంచి రాష్ట్రం అప్పులు సేకరించిందని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అర్ధరాత్రి ఎత్తిన కాలువ గేట్లు.. నీట మునిగిన పంట
    ఆపద వస్తే అందరికీ అండగా ఉండి ఆదుకోవాల్సిన నాయకుడు.. తన స్వార్థం కోసం అర్ధరాత్రి కాలువ గేట్లు ఎత్తించడంతో అనేకమంది రైతుల పంట నీటిపాలైంది. తెల్లవారుజామున వచ్చి పంట కోసేందుకు వచ్చిన రైతులు.. నీట్లో మునిగి ఉండటంతో లబోదిబోమంటున్నారు. తమను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పేరు తప్పుగా పడిందని వినూత్న నిరసన.. అధికారి ముందు కుక్కలా మొరుగుతూ..
    రేషన్ కార్డులో పేరు తప్పుపడిందని ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ కారు ఎదుట కుక్కలా అరిచాడు. ఈ విచిత్ర సంఘటన బంగాల్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈయన 'స్కెచ్' వేస్తే నేరస్థులకు వణుకే.. 500 మందిని పట్టించిన నితిన్!
    నేరస్థులను పట్టించడంలో పోలీసులకు వెన్నెముక నిలుస్తున్నారు ఓ వ్యక్తి. డ్రాయింగ్​పై ఉన్న ఇష్టంతో.. నేరస్థులకు కళ్లెం వేస్తున్నారు! అనేక కీలక కేసుల్లో ఆయన గీసిన చిత్రాలతోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అసలెవరాయన? ఆయన కథేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తనకన్నా మూడేళ్ల చిన్న వ్యక్తిని పెళ్లాడిన బైడెన్ మనవరాలు
    అమెరికా అధ్యక్షుడు జోబైడెన్​ మనవరాలు నయోమీ బైడెన్ వివాహం ఘనంగా జరిగింది. బంధు మిత్రుల మధ్య శ్వేతసౌధంలో వధువరులు ఒక్కటయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో ఉన్నా.. భారత్ మాత్రం సేఫ్'
    ప్రపంచం మొత్తం ఆర్థికమాంద్యంలో చిక్కుకున్నాసరే.. భారత్​లో మాత్రం ఆ పరిస్థితి రాదని నీతి ఆయోగ్​ వైస్​ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. అయితే భారత వృద్ధిరేటుపై కొంతమేర ప్రభావం ఉంటుందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సూర్య సూపర్ సెంచరీ.. కివీస్​తో టీ20 సిరీస్​లో టీమ్ఇండియా బోణీ
    న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో టీమ్ ఇండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
    న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20 మ్యాచ్​​లో టీమ్‌ఇండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో ఫామ్​ లేమితో బాధపడుతున్న కేన్​ విలియమ్సన్ (65) పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్​ ఆడాడు. డెవాన్ కాన్వే (25), గ్లెన్​ ఫిలిప్స్​(12), డార్లీ మిచెల్(10) పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీపక్​ హుడా(4), చాహల్​, సిరాజ్​ 2 చొప్పున, అర్షదీప్​, భువీ ఒక్కో వికెట్ పడగొట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రముఖ యువ నటి కన్నుమూత.. కారణం ఇదే!
    ప్రముఖ బెంగాలీ యువ నటి ఆండ్రిలా శర్మ కన్నమూశారు. గుండెపోటుతో కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.