ETV Bharat / state

నంద్యాల పురపాలక సమావేశంలో నీటి యుద్ధం.. ఆరుగురు ఉద్యోగులపై వేటు

author img

By

Published : Apr 2, 2023, 2:21 PM IST

Updated : Apr 2, 2023, 3:20 PM IST

water problem in Nandyala
water problem in Nandyala

water problem in Nandyala: నంద్యాలను తాగునీటి సమస్యపై కౌన్సిల్‌ వేదికగా అధికార, విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నిసార్లు సమస్యను చెప్పినా స్పందన కరవైందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి.. సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు నీళ్లు ఇవ్వడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని తెలుగుదేశం విమర్శించింది.

Water Problem in Nandyala: గత కొంతకాలంగా నంద్యాలలో తాగునీటి సమస్య నెలకొంది. పలుసార్లు విన్నవించినా ప్రజల దాహార్తిని తీర్చే నాధుడే లేడని స్వపక్ష, విపక్ష కౌన్సిలర్లు వాపోతున్నారు. తాగునీటి సమస్యను వెంటనే తీర్చాలంటూ.. పురపాలక సమావేశంలో సభ్యులు గొంతెత్తారు. అధికార పార్టీకి చెందిన వారితో పాటు విపక్ష సభ్యులూ సమస్య తీవ్రతను వివరించారు. తాగునీరు ఇవ్వాలంటూ ప్రజలు ఇంటి వద్దకు వస్తుంటే.. ఏడుపు వస్తుందని ఒకరు.. ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారని మరొకరు వాపోయారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.. సభ్యులు చెప్పే సమస్యలు విని అవాక్కయ్యారు.

తాగునీటి సరఫరా పనుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఆరుగురిని సస్పెండ్ చేశారు. సమస్యపై దృష్టి సారించాలని.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని.. నంద్యాల టీడీపీ ఇంఛార్జి భూమా బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం చేసిన ఓ రెగ్యులర్ ఉద్యోగితో పాటు అయిదు మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. తాగునీటి సమస్య ఇపుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేసి అందరికీ తాగునీరు అందిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ రవి చంద్రారెడ్డి అన్నారు.

మనం మెల్లగా.. నిదానంగా చేయడానికి ఇవి మెల్లిగా చేసే పనులు కాదు.. ఎమర్జెన్సీ పనులు.. ఇవన్నీ కూడా ఒకసారి మొదలు పెడితే వెంటనే ఇచ్చే విధంగా ఉండాలి కానీ తర్వాత చేద్దాంలే అనే విధంగా ఉండకూడదు. అవసరం అయితే సిబ్బందిని పెంచుకోండి.. అంతేకానీ పనులు మాత్రం ఆలస్యం అవ్వకూడదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు సమస్య మాత్రం పరిష్కారం కావాలి. ప్రజలు మాత్రం ఏప్రిల్​, మె నెలలో మాత్రం నీటి సమస్య ఉందని మాత్రం చెప్ప కూడదు.- శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్యే, నంద్యాల

తాగునీటి సమస్య గురించి గత ఆరు, ఏడు నెలలుగా ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం.. కానీ ప్రజల కష్టాలు ప్రభుత్వానికి పట్టనట్టుగా ఉంది. వైసీపీ నాయకులు అదిగో చేస్తాం.. ఇదిగో చేస్తాం అని మాటలు చెప్తున్నారే తప్ప.. ఇప్పటివరకూ ప్రతి వార్డులో మూడు నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి.. ఈ రోజు ఇంత దయనీయంగా నంద్యాలకు ఈ పరిస్థితి వచ్చింది.. అని తెలియజేస్తున్నాం. నిన్న నంద్యాల ఎమ్మెల్యే మున్సిపల్​ ఆఫీస్​కి వెళ్తే దానికి పరిష్కారం దొరుకుతుంది అని అందరం అనుకున్నాం.. కాని అక్కడకు వెళ్లాక అధికారులకు చెప్తారే తప్ప పనులు చేయట్లేదు.- భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ నేత

నంద్యాల పురపాలక సమావేశంలో నీటి యుద్ధం.. ఆరుగురు ఉద్యోగులు సస్పెన్షన్​

ఇవీ చదవండి:

Last Updated :Apr 2, 2023, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.