bear attack: వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. ఎక్కడంటే..?

author img

By

Published : Aug 6, 2022, 1:35 PM IST

bears attacked

bear attack: ఇటీవల పలు జిల్లాలో ఏనుగులు, పులులు.. ఇతర వన్య ప్రాణులు మనుషులపై దాడులు చేస్తున్నాయి. తాజాగా.. నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది.

bears attack: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. అహోబిలానికి చెందిన శ్రీను మరో ఇద్దరు కలిసి జీవనోపాధిలో భాగంగా తేనె సేకరించడానికి అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఎగువ అహోబిలం అటవీ ప్రాంతంలో సైకిల్​పై వెళ్తుండగా.. వారిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు తప్పించుకోగా.. శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడికి ఆళ్లగడ్డలో ప్రాథమిక చికిత్స నిర్వహించి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.