ETV Bharat / state

జీవితంపై విరక్తితో యాసిడ్ తాగిన దంపతులు.. భార్య మృతి

author img

By

Published : Jun 30, 2022, 10:59 PM IST

Couple Drink Acid in Nandyal District
Couple Drink Acid in Nandyal District

Couple Drink Acid in Nandyal District: జీవితంపై విరక్తితో భార్యాభర్తలు యాసిడ్ తాగారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదకర ఘటన నంద్యాల జిల్లా భాస్కరపురంలో చోటుచేసుకుంది.

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం భాస్కరపురంలో విషాదం చోటుచేసుకుంది. భాస్కరపురం గ్రామానికి చెందింన దంపతులు సమీరా- స్వాములు.. జీవితంపై విరక్తితో యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో భార్య సమీరా మృతి చెందగా.. భర్త స్వాములును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు.. తండ్రీకొడుకులు దుర్మరణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.