ETV Bharat / state

ఆదోనిలో ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

author img

By

Published : Jul 1, 2021, 11:36 AM IST

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తాగు నీరు వదలకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆదోనిలో మహిళలు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో రోడ్డు మీదికి వచ్చారు. వారం రోజులకోసారి నీరు వదులుతున్నారని.. ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

women agitations about water problem
women agitations about water problem

తాగునీటి కోసం కర్నూలు జిల్లా ఆదోనిలో మహిళలు ఖాళీ బిందెలతో గుంపులుగుంపులుగా చేరారు. పట్టణ శివారు పర్వతపురం వద్ద నీటి కోసం బారులు తీరారు. కరోనా సమయంలో తాగునీరు వదలకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక నాయకులను సమస్య గురించి అడిగితే .. మోటర్ల సమస్య, పైపులైన్ లీకేజీ అని సమాధానం ఆ ఇస్తున్నారని.. వారం రోజులకు ఒకసారి నీరు వదిలితే ఎలా బతకాలని అంటున్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా అధికారులు స్పందించట్లేదని మహిళలు వాపోయారు. ట్యాంకర్ల ద్వారా సరిపడా నీటిని అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

కర్నూలులో సీపీఎం నాయకుల గృహనిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.