srisailam dam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. రెండు గేట్ల ద్వారా నీటి విడుదల

author img

By

Published : Sep 16, 2021, 7:38 AM IST

Updated : Sep 16, 2021, 10:08 AM IST

Srisailam reservoir

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 55 వేల 600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 2,20,810 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

శ్రీశైలం జలాశయం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 2,20,810 క్యూసెక్కులు కొనసాగుతోంది. దీంతో అధికారులు..ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 55,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 44,597 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

జలాశయం ప్రస్తుతం నీటిమట్టం 884.40 అడుగులు కాగా.. గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 212.43 టీఎంసీలు కాగా.. గరిష్ఠ నీటినిల్వ 215.80 టీఎంసీలుగా ఉంది.

ఇదీ చదవండీ.. polavaram: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ఆకలి కేకలు.. పట్టించుకోవడం లేదని ఆవేదన

Last Updated :Sep 16, 2021, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.