ETV Bharat / state

AP Crime News రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి..కర్నూలులో చైన్ స్నాచర్స్ హల్ చల్

author img

By

Published : Jun 24, 2023, 3:39 PM IST

Two Farmers Died in Road Accident: పండించిన కూరగాయలు మార్కెట్​లో అమ్ముకొని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఇద్దర రైతులు దుర్మరణం పాలైయ్యారు. ఈ దుర్ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చొటుచేసుకుంది. మరో వైపు కర్నూలులో చైన్ స్నాచర్స్ హల్ చల్ చేశారు. ఒకేరోజు మూడు ప్రదేశాల్లో చైన్ స్నాచింగ్ దొంగలు రెచ్చిపోయారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి

Two Farmers Died in Road Accident : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పండించిన పంటను హిందూపూరం మార్కెట్ ​లో అమ్ముకొనేందుకు, బొలెరో వాహనంలో బయలుదేరిన రైతులు.. చిలమత్తూరు మండలం టేకులోడు క్రాస్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు రైతులు మృతి చెందారు. పాతచాములపల్లికి చెందిన రైతు మధు అక్కడికక్కడే మృతి చెందగా, మరో రైతు వెంకట్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురు క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోని దర్యాప్తు చేపట్టారు.

ఒకేరోజు మూడు ప్రదేశాల్లో చైన్ స్నాచింగ్ : రాష్ట్రంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళ మెడలో బంగారు గొలుసుతో కనపిండితే చాలు.. అది ఎక్కడ పోతుందోననే ఆందోళన, సగటు మహిళలో నెలకొంది. ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో.. వెంట వెంటనే గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో, ఒక్కరిద్దరే.. పక్కా స్కెచ్ తో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారనే అనుమానం వ్యక్తమవుతోంది. వరుస ఘటనలో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్ళడానికి భయాందోళనకు గురి అవుతున్నారు.

ఇవాళ కర్నూలులో చైన్ స్నాచర్స్ హల్ చల్ చేశారు. ఉదయం కర్నూలు నగరంలోని బుధవారపేట, కృష్ణానగర్, బాలాజీ నగర్​లలో ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులను దొంగిలించేందుకు తెగబడ్డారు. బుధవారపేటలో ఇంటి ముందు ఉన్న ఓ మహిళ గొంతులో ఐదు తులాల బంగారు గొలుసులు దుండగులు లాకెళ్ళారు. కృష్ణా నగర్ వద్ద ఓ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళ కిందపడి గాయపడ్డారు. అప్రమత్తమైన ఆమె గట్టిగా కేకలు వేశారు. చుట్టుపక్కల ఉన్న స్థానికులు వచ్చి దొంగలను పట్టుకునేందుకు వారి వెంబడి పడ్డారు. దొంగలు స్థానిక ప్రజలు దొరకకుండా బైక్ పై వేగంగా ప్రయాణించి తప్పించుకున్నారు.

ఇదే తరహాలో బాలాజీ నగర్​లో కూడా గొలుసు దొంగలు ఓ మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లె ప్రయత్నం చేయగా మహిళ గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుండి వారు వెళ్లిపోయారు. వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనలపై కర్నూలు మూడవ పట్టణ, తాలూకా పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు అయ్యాయి. కర్నూలు నగరంలో ఒకేరోజు మూడు ప్రదేశాల్లో చైన్ స్నాచింగ్ జరుగుతుండటంతో మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.