కర్నూలు జిల్లా నంద్యాలలో పట్టపగలే చోరీ జరిగింది. స్థానిక సాయిబాబానగర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో హాబీబ్ ఖాన్ అనే ఉద్యోగి ఇంట్లో దొంగలుపడ్డారు. బీరువాలను పగలగొట్టి నగదు, బంగారం అపహరించుకొనివెళ్లారు. సుమారు రూ.3 లక్షలు, మూడు తులాల బంగారు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు.
ఇంటికి తాళం వేసి ఉదయం 8.30 షాపింగ్ వెళ్లి... తిరిగి 12.30 లోపు ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తీసి ఉన్నాయి. పట్టపగలే చోరీ జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగతనం జరిగిన ఇంటిని పోలీసులు పరిశీలించారు.
ఇదీ చూడండి: