ETV Bharat / state

నంద్యాలలో భారీ చోరీ.. 3 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు మాయం

author img

By

Published : May 12, 2021, 4:08 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ఇంట్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. మూడుతులాల బంగారం, మూడు లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

theft at nandyala
తెరిచి ఉన్న బీరువా

కర్నూలు జిల్లా నంద్యాలలో పట్టపగలే చోరీ జరిగింది. స్థానిక సాయిబాబానగర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో హాబీబ్ ఖాన్ అనే ఉద్యోగి ఇంట్లో దొంగలుపడ్డారు. బీరువాలను పగలగొట్టి నగదు, బంగారం అపహరించుకొనివెళ్లారు. సుమారు రూ.3 లక్షలు, మూడు తులాల బంగారు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు.

ఇంటికి తాళం వేసి ఉదయం 8.30 షాపింగ్ వెళ్లి... తిరిగి 12.30 లోపు ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తీసి ఉన్నాయి. పట్టపగలే చోరీ జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగతనం జరిగిన ఇంటిని పోలీసులు పరిశీలించారు.

ఇదీ చూడండి:

కరోనా టీకా దొరక్క మధ్య తరగతి ప్రజలు విలవిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.