ETV Bharat / state

సిరివెళ్లలో వరస చోరీలు... భయాందోళనలో స్థానికులు

author img

By

Published : Dec 5, 2020, 1:07 AM IST

silver, cash theft in sirivella kurnool district
సిరివెళ్లలో వరస చోరీలు

కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలంలోని వరస చోరీలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంలోని మూడు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు వెండి, నగదు అపహరించారు.

కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలంలోని మూడు ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు... దొంగతనానికి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి దాదాపు వంద తులాల వెండి, రూ.80 వేలు నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా వేలిముద్రలు సేకరించారు.

గత నెలలో సిరివెళ్ల మండల పరిధిలోని మూడు గ్రామాల్లోని ఆలయాల్లో దొంగలు చోరీ చేసి వెండి ఆభరణాలను అపహరించారు. వరసగా జరుగుతున్న ఈ ఘటనలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ఇదీచదవండి.

దిశ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.