ETV Bharat / city

దిశ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం

author img

By

Published : Dec 4, 2020, 10:57 PM IST

Updated : Dec 5, 2020, 7:14 AM IST

సవరణలతో ప్రవేశపెట్టిన దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. గతంలో ఈ బిల్లును రాష్ట్రం నుంచి కేంద్రం అనుమతి కోసం పంపగా... కేంద్రం కొన్ని సూచనలు చేసింది. కేంద్రం సూచనల మేరకు సవరించి.. శుక్రవారం ఆమోదించారు.

దిశ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం
దిశ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం

రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణ, త్వరితగతిన శిక్ష పడటం కోసం ఉద్దేశించిన బిల్లు (దిశ)-2020ను రాష్ట్ర శాసనసభలో శుక్రవారం ఆమోదించినట్టు పీటీఐ వెల్లడించింది. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటు ద్వారా ఈ బిల్లుకు ఆమోదం లభించిందని తన కథనంలో పీటీఐ పేర్కొంది.

మొదటి ఈ బిల్లును ఏపీ శాసనసభ నుంచి కేంద్రం అనుమతి కోసం పంపారు. కేంద్రం కొన్ని మార్పులను సూచించింది. కేంద్రం సూచనల మేరకు సవరించిన బిల్లు శుక్రవారం శాసనసభలో ఆమోదం పొందింది. దీని ప్రకారం మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి జరిగినప్పుడు 7 పనిదినాల్లో విచారణ, 14 పనిదినాల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాలి.

ఇదీ చదవండీ... స్థానిక ఎన్నికలపై తీర్మానం..ఏకగ్రీవంగా ఆమోదం

Last Updated :Dec 5, 2020, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.