ETV Bharat / state

రెండు నెలల చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

author img

By

Published : Nov 2, 2020, 5:09 PM IST

police chasing child kidnap case
రెన్నెళ్ల చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

రెండు నెలల పసికందు అపహరణ కేసును ఆదోని పోలీసులు ఛేదించారు. బాధితురాలి చెల్లి చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు నిఘానేత్రాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఆమెపై కేసు నమోదు చేసి.. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు.

చిన్నారి అపహరణ కేసును కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు ఛేదించారు. షేక్ నిలోఫర్ అనే మహిళ తమ రెండు నెలల బాబు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా నేత్రాల ఆధారంగా బాధితురాలి సొంత చెల్లెలు గోరినే చిన్నారిని ఎత్తుకెళ్లిందని పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రెండు నెలల చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

ఇదీ చదవండి:

రక్తదానం, నేత్రదానంతో అండగా నిలుస్తున్న యువకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.