ETV Bharat / state

రసాయన మిశ్రమం తాగిన పీజీ విద్యార్థి.. పరిస్థితి విషమం

author img

By

Published : Jan 29, 2021, 4:48 PM IST

ప్రాక్టికల్స్​ కోసం కళాశాలకు హాజరైన పీజీ విద్యార్థి రసాయన మిశ్రమాన్ని తాగేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలోని నేషనల్ పీజీ కళాశాలలో జరిగింది. విద్యార్థి మతిస్తిమితం సరిగా లేదని అతని తండ్రి తెలిపారు.

PG student drank chemical
రసాయన మిశ్రమం తాగిన పీజీ విద్యార్థి

కర్నూలు జిల్లా నంద్యాలలోని నేషనల్ పీజీ కళాశాలలో విజయ్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎమ్మెస్సీ రెండో ఏడాది చదవుతున్న విద్యార్థి.. ప్రయోగశాలలో జరుగుతున్న ప్రాక్టీకల్స్​కు హాజరయ్యాడు. ఈ క్రమంలో రసాయన మిశ్రమాన్ని తాగేశాడు. విజయ్​ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మతిస్తిమితం సరిగా లేదని అతని తండ్రి పోలీసులకు తెలిపారు.

ఇదీ చదవండి: కర్నూలులో దీక్ష చేపట్టిన అక్షయ గోల్డ్ బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.