కర్నూలు జిల్లా నంద్యాల మండలం పాండురంగపురం గ్రామానికి చెందిన మున్నంగి నాగరాజు అనే వ్యక్తి గత 12 ఏళ్లుగా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పింఛను తీసుకునేందుకు వెళ్లాడు. వేలిముద్రలు వేస్తే.. ఆన్లైన్లో మరణించినట్లుగా చూపించింది. ఇది విన్న ఆ వృద్ధుడు అవాక్కయ్యాడు. తాను బతికే ఉన్నానని అధికారులకు తెలిపాడు. తిరిగి అన్ని ఆధారాలు తీసుకున్న అధికారులు.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పింఛను మంజూరు చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: