ETV Bharat / state

పదో తరగతి వరకు సబ్జెక్టులన్నీ బోధించేది ఒక్కరే !

author img

By

Published : Nov 8, 2019, 8:01 PM IST

రాష్ట్రంలోని సర్కార్​ బడుల దుస్థితికి అద్దం పడుతోంది కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాలలోని పరిస్థితి. ఇక్కడ ఐదు తరగతులకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడే ఉన్నారు. 80 మందికిపైగా విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడే అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారు.

ఒకే ఒక్కడు

5 తరగతులు.. ఒక్కరే ఉపాధ్యాయుడు
కర్నూలు జిల్లా హాలహర్వి ప్రాథమికోన్నత పాఠశాలను రెండేళ్ల క్రితం ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 82 మంది పైగా విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. పాఠశాలను ఆధునీకరించిన అధికారులు అందుకు తగిన విధంగా సిబ్బందిని నియమించలేదు. అప్పటి నుంచి పాఠశాలలో ఉన్న తెలుగు ఉపాధ్యాయుడుతోనే నెట్టుకొస్తున్నారు. అన్ని సబ్జెక్టులను ఆయనే బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న ఒక్క గురువు.... ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుల సహకారం తీసుకుని పాఠశాలను నడిపిస్తున్నారు. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు చదువులు ముందుకు సాగక పాఠశాలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోధనా సిబ్బందిని నియమించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.