ETV Bharat / state

రెండు ఆటోలు ఢీ.. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

author img

By

Published : Apr 16, 2021, 10:56 PM IST

కర్నూలు జిల్లా రాచమర్రిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం క్షతగాత్రులను ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

one man died in a road accident at rachamarri
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా మాధవరం మండలం రాచమర్రి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచదవండి.

మహిళతో అసభ్య ప్రవర్తన.. 21మంది అరెస్ట్

జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.