ఓ పక్క కరోనా రోజురోజుకూ విజృంభిస్తూ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. కర్నూలులో కొత్తగా విడుదలైన వకీల్ సాబ్ సినిమా చూసేందుకు థియేటర్లకు వచ్చిన సినీ అభిమానులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. సినిమాల విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద భౌతిక దూరం, మాస్కుల ధారణ వంటి నియమాలను పట్టించుకోకుండా రహదారిపై గుంపులుగా నిలబడి రాకపోకలకు సైతం ఆటంకాలు కలిగిస్తున్నారు.
కరోనా నియంత్రణ విషయంలో కేంద్రం, హైకోర్టు ఎంత సీరియస్గా ఆదేశాలు ఇస్తున్నా.. ప్రజలు మాత్రం వాటిని పెడచెవిన పెడుతున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో భౌతిక దూరం పాటించి మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నా చాలామంది ఆచరణలో వాటిని పాటించడం లేదు.
ఇదీ చదవండి:
మహానందికి వెళ్తున్న కర్ణాటక భక్తుల వాహనం బోల్తా..పదిమందికి గాయాలు