ETV Bharat / state

ఆయుర్వేదం, హోమియో కంటే అల్లోపతికే ప్రాధాన్యత ఇస్తాం: బుగ్గన

author img

By

Published : May 24, 2021, 5:00 PM IST

kurnool
బుగ్గన రాజేంద్రనాథ్ కర్నూలులో ఉన్నతాధికారులతో సమీక్ష

కోవిడ్ వ్యాక్సినేషన్​పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కర్నూలులో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడిలో రాష్ట్రం బాగా పని చేస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుర్వేదం, హోమియో కంటే అల్లోపతికే ప్రాధాన్యత ఇస్తామన్నారు

కరోనా కట్టడిలో రాష్ట్రం బాగా పని చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలులో అన్నారు. కర్నూలు జిల్లాలో కొవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ ప్లాంట్లు, వ్యాక్సిన్ కార్యక్రమంపై చర్చించామని మంత్రి తెలిపారు. కరోనా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుర్వేదం, హోమియో కంటే అల్లోపతికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. కరోనా నివారణకు వ్యాక్సిన్ మాత్రమే మందు అని అన్నారు.

ఇదీ చూడండి.

ఆనందయ్య కరోనా మందు పనితీరుపై.. పరిశోధన ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.