ETV Bharat / state

కర్నూలు జిల్లాలో తెలంగాణ మద్యం స్వాధీనం

author img

By

Published : Sep 8, 2020, 8:06 PM IST

కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం రవాణా జోరుగా సాగుతోంది. పంచలింగాల చెక్​పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు... తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

wine in kurnool district
పోలీసులు పట్టుకున్న తెలంగాణ మద్యం

కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనఖిల్లో కారులో 1540 మద్యం బాటిళ్లను తీసుకెళ్తూ ఇద్దరు పోలీసులకు చిక్కారు.

తెలంగాణా రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన వేముల రాజు గౌడ్, కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన బీచుపల్లి అనే వ్యక్తులను అరెస్టు చేసి రెండు కార్లను, మద్యం బాటిళ్లు స్వాదీనం చేసుకున్నట్లు సీ.ఐ. లక్ష్మీ దుర్గయ్య తెలిపారు.

ఇదీ చదవండి:

'అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎంకు చెప్పా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.