ETV Bharat / state

'భారీ వర్షానికి తెగిన నల్లమేకపలపల్లి రహదారి'

author img

By

Published : Sep 26, 2019, 5:14 PM IST

కర్నూలు జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు ప్యాపిలి మండలంలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించాయి. నల్లమేకలపల్లి నుంచి రాంపురం, మామిళ్లపల్లి గ్రామాలకు వెళ్లే రహదారి కోతకు గురి కావటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి.

భారీ వర్షానికి తెగిన నల్లమేకపలపల్లి రహదారి

కర్నూలు జిల్లాలో గత 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ప్యాపిలి మండలంలో 125 m.m వర్షపాతం నమోదయింది. వరద ధాటికి నల్లమేకలపల్లి నుంచి రాంపురం, మామిళ్లపల్లి గ్రామాలకు వెళ్లే రహదారి కోతకు గురయింది. ఈ గ్రామాల ప్రజలు ప్యాపిలి, డోన్ కు వెళ్లాలంటే చుట్టూ 10 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తెగిన రహదారిని చూడటానికి ఏ ఒక్క అధికారి రాలేదని గ్రామస్థులు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షానికి తెగిన నల్లమేకపలపల్లి రహదారి

ఇదీ చూడండి: కర్నూలులో భారీ వర్షం... పొంగుతున్న వేదావతి

Intro:ap_knl_32_26_dhukanam_dhagdham_av_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శకుంతల కూడలి వద్ద విద్యుదాఘాతంతో శ్రీలక్షి వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ప్రమాదంలో దాదాపు 30 లక్షల విలువైన వస్త్రాలు కాలి బూడిదయ్యాయి. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా,8008573794.Body:అగ్నిప్రమాదంConclusion:వస్త్ర దుకాణం కాలిపోయింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.