ETV Bharat / state

ఉద్ధృతంగా కుందూ నది.. మునిగిన వంతెన

author img

By

Published : Sep 26, 2020, 11:39 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కుందూ నది ఉద్ధృతి భారీగా పెరిగింది. నదిలోకి వరద చేరి వంతెన మునిగింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

heavy flow to kundhu  river
మునిగిన వంతెన

లోతట్టు ప్రాంతాలకు వరద

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కుందూనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నల్లమలలో కురిసిన భారీ వర్షాలకు నదిలోకి వరద చేరి వంతెన మునిగింది. వైఎస్​ నగర్, నందమూరినగర్, పులిమద్ది, రాయమలుపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మద్దులేరు వాగు ఉద్ధృతి భారీగా పెరిగింది. పి.వి. నగర్, భీమవరం గ్రామాలకు వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మహానంది వద్ద పాలేరు వాగు పొంగి పొర్లుతోంది. ఈ నీరు నంద్యాల చామ కాలువకు చేరుతోంది.

ఇదీ చదవండి: ఉరుములు, మెరుపులతో వర్షాలు... రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.