ETV Bharat / state

GADAPA-GADAPA: 'గడప-గడప'కూ సమస్యలే.. ఆదోని ఎమ్మెల్యేని నిలదీసిన స్థానికులు

author img

By

Published : May 22, 2022, 8:21 AM IST

GADAPA-GADAPA
ఆదోని ఎమ్మెల్యేని నిలదీసిన స్థానికులు

GADAPA-GADAPA: గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటిస్తున్న నాయకులు, ప్రజాప్రతినిధులందరిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డిని సైతం స్థానికులు నిలదీశారు.

GADAPA-GADAPA: గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డిని.. తమ సమస్యలు పరిష్కారించాలంటూ స్థానికులు నిలదీశారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, చర్యలెప్పుడు తీసుకుంటారని బైచిగేరి గ్రామస్తులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. గ్రామంలో చాలా మందికి పెన్షన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదోని ఎమ్మెల్యేని నిలదీసిన స్థానికులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.