ETV Bharat / state

కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

author img

By

Published : Dec 26, 2022, 8:16 PM IST

Car Caught in Fire : కర్నూలు జిల్లాలో మంటల్లో చిక్కుకుని కారు దగ్దమైంది. వేగంతో వెళ్తున్న కారు ఘాట్​రోడ్డులోని కిలోమీటర్​ రాయిని ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోని మరో ప్రమాదంలో టైరు పంక్చర్​ కావటంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులోని వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.

Car Caught in Fire
మంటల్లో చిక్కుకున్న కారు

Car Caught in Fire : కర్నూలు జిల్లాలోని సోమాయాజులపల్లెలో కారు మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. నంది డెయిరీ ఎండీ వికాస్​రెడ్డి కుంటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్​ నుంచి నంద్యాలకు కారులో బయల్దేరారు. కారు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లెకు చేరుకొగానే.. ఘాట్​రోడ్డులోని కిలోమీటర్​ రాయిని కారు ఢీకొట్టింది. ఈ సమయంలో కారు వేగంగా ఉండటంతో కారు ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. కారులో ఉన్నవారు అప్రమత్తమై.. బయటకు దిగటంతో ప్రాణ నష్టం తప్పింది. రహదారి సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

కర్నూలు జిల్లాలో మంటల్లో చిక్కుకున్న కారు..

పల్టీలు కొట్టిన కారు: ఎన్టీఆర్​ జిల్లా కంచిచర్ల మండలంలో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. హైదరాబాద్​ నుంచి విజయవాడ బయల్దేరిన కారు.. ఎన్టీఆర్​ జిల్లా కంచికర్ల మండలం కీసర వద్దకు రాగానే, ముందు టైర్​ పంక్చర్​ కావటంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలపాలయ్యారు. కీసర టోల్​గేట్​ అంబులెన్స్​ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని వైద్యం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.