ETV Bharat / state

'అభ్యర్థులను వైకాపా నాయకులు బెదిరిస్తున్నారు'

author img

By

Published : Feb 4, 2021, 6:58 PM IST

కర్నూలు జిల్లాలో వైకాపా నాయకులు నామినేషన్ దాఖలు చేసిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని భాజపా నేతలు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

bjp leaders complaint about ycp
'అభ్యర్థులను వైకాపా నాయకులు బెదిరిస్తున్నారు'

రాష్ట్రంలో పాలెగాండ్ల పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విఘ్ణవర్దన్ రెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని... వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా నాయకులు జిల్లా ఎస్పీ డాక్టర్.ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు.

వైకాపా ఎమ్మెల్యే అనుచరులు.. నామినేషన్ దాఖలు చేసిన వారిని ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని భాజపా నేతలు ఆరోపించారు. అధికారులు స్పందించి పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి

కిలో పాలు రూ.33... ఆ కథేంటి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.