ETV Bharat / state

ఉగాది సంబరాలు... బురదలో ఎద్దుల, గాడిద బండ్ల ఊరేగింపు అదరహో...

author img

By

Published : Apr 4, 2022, 5:17 AM IST

కర్నూలు జిల్లాలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. కల్లూరులోని చౌడేశ్వరీ ఆలయంలో ఎద్దుల, గాడిద బండ్ల ఊరేగింపుని ఉత్సహంగా జరిపారు. ఊరేగింపుని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

Ugadi celebrations
Ugadi celebrations

కర్నూలులో ఉగాది ఉత్సవాలు రెండో రోజూ ఘనంగా జరిగాయి. కల్లూరులోని చౌడేశ్వరీ ఆలయంలో పండగ ఉత్సవాలు వైభవంగా సాగాయి. చుట్టూ.. బురుదనీరు ఏర్పాటు చేసి వాటిలో ఎద్దులు, గాడిద బండ్లను ఊరేగించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ ఏడాది కూడా బండ్ల ఊరేగింపుని ఉత్సహంగా జరిపారు. బురదలో వస్తున్న బండ్లపైకి భక్తులు బురద చల్లుతూ.. ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఊరేగింపుని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

ఇదీ చదవండి: జోరుగా "పిడకల యుద్ధం".. వేలాదిగా తరలి వచ్చిన జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.