ETV Bharat / state

'ప్రజా సమస్యల పరిష్కారమే వైకాపా ఎజెండా'

author img

By

Published : Nov 6, 2020, 7:35 PM IST

ప్రజా సమస్యల పరిష్కారమే వైకాపా ఎజెండా అని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ప్రజలతో నాడు- ప్రజల కోసం నేడు పేరిట పాదయాత్ర చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

samineni udaya bhanu
'ప్రజా సమస్యల పరిష్కారమే వైకాపా ఎజెండా'

ప్రజలతో నాడు- ప్రజల కోసం నేడు పేరిట ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పాదయాత్ర చేపట్టారు. ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లు పూర్తిచేసుకుందని తెలిపారు. పట్టణంలోని 18, 20, 21వ వార్డులో అధికారులతో కలిసి పర్యటించారు.

ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతోందని సామినేని స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి వర్గాల వారికి మేలు చేసేలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు'.. వైకాపా నేతల పాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.