ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నెలల తరబడి తిప్పుతున్నారంటూ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన బొజ్జవరపు ప్రమీల మంగళవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష(hunger strike ) చేపట్టారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ప్రమీల భర్త బొజ్జవరపు ఆనంద్శేఖర్ 8 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆ తరువాత భర్త కుటుంబ సభ్యులతో ప్రమీలకు విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ప్రమీల అర్జీ దాఖలు చేయగా.. ఆమె భర్త కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు.
ఫలితంగా.. అధికారులు ధ్రువపత్రం మంజూరును పెండింగ్లో ఉంచారు. కాగా.. ఈ విషయమై తహసీల్దారు పద్మజ మాట్లాడుతూ.. ప్రమీల భర్త కుటుంబ సభ్యుల అభ్యంతరం వల్లే సర్టిఫికెట్ పెండింగ్లో ఉంచామన్నారు.
ఇదీ చదవండి: HC ON WOMEN POLICE SECRETARIES: మహిళా పోలీసు కార్యదర్శుల నియామకంపై హైకోర్టులో విచారణ